లైంగిక కోరిక తీర్చాలన్నందుకే హత్య | - | Sakshi
Sakshi News home page

లైంగిక కోరిక తీర్చాలన్నందుకే హత్య

Jun 18 2025 3:21 AM | Updated on Jun 18 2025 3:21 AM

లైంగిక కోరిక తీర్చాలన్నందుకే హత్య

లైంగిక కోరిక తీర్చాలన్నందుకే హత్య

తండ్రిని చంపిన కూతురి రిమాండ్‌

బోధన్‌: తండ్రిని రోకలి దుడ్డుతో కొట్టి చంపిన కూతురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. నవీపేట పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఽనవీపేట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య(54)కు ఇద్దరు కూతుళ్లు. ఇరువురికి వివాహం చేశారు. పెద్ద కూతురు గంగామణి భర్త మృతి చెందడంతో పదేళ్ల నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ధర్మారంలోనే ఉంటుంది. పెద్ద కూతురు గంగామణి పట్ల నర్సయ్య అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో ఇంట్లో గొడవలు జరిగి పది రోజుల నుంచి నర్సయ్య భార్య నర్సమ్మ, పెద్ద కూతురు నిజామాబాద్‌లో వేరుగా జీవిస్తున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని తాళ్ల కొత్తపేట గ్రామంలో ఉంటున్న చిన్న కూతురు మక్కల వర్షిణి అలియాస్‌ మమత సోమవారం ధర్మారంలోని తండ్రి వద్దకు వచ్చింది. మద్యం మత్తులో ఉన్న నర్సయ్య లైంగిక కోరిక తీర్చాలని చిన్న కూతురుని వేధించాడు. ఆగ్రహించి పక్కనే ఉన్న రోకలి దుడ్డుతో తలపై రెండుసార్లు కొట్టడంతో నర్సయ్య అక్కడికక్కడే మరణించాడు. రక్తం, గాయాలు చూసి భయపడిన మమత ఇంటి తలుపులు దగ్గరగా మూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో నవీపేట ఎస్సై వినయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement