‘డబుల్‌’ ఇళ్లను పేదలకు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ ఇళ్లను పేదలకు కేటాయించాలి

Jun 18 2025 3:23 AM | Updated on Jun 18 2025 3:23 AM

‘డబుల్‌’ ఇళ్లను పేదలకు కేటాయించాలి

‘డబుల్‌’ ఇళ్లను పేదలకు కేటాయించాలి

భిక్కనూరు: మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను.. ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే కేటాయించాలని అదనపు కలెక్టర్‌ విక్టర్‌ ఆదేశించారు. మంగళవారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో కిటికీలు, విద్యుత్‌ వైర్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని .. వాటికి తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించారు. ఇల్లు లేని మహిళలు ఆయనను కలిసి తమకు ఇళ్లు కేటాయించాలని కోరారు. పీఆర్‌ ఈఈ దుర్గాప్రసాద్‌, డీఈఈ స్వామి దాస్‌, కామారెడ్డి ఆర్డీవో వీణ, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, ఆర్‌ఐ బాలయ్య, తదితరులున్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి

భిక్కనూరు: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్‌ విక్టర్‌ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని సూచించారు. వైద్యాధికారి హెమీమా, ఆయుర్వేద వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఆరోగ్య విస్తర్ణ అధికారి వెంకటరమణ, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement