ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

Jun 18 2025 3:23 AM | Updated on Jun 18 2025 3:23 AM

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

లింగంపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు వేగవంతం చేయాలని డీఆర్‌డీవో సురేందర్‌ సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తే దశలవారీగా బిల్లులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంపీడీవో నరేష్‌, ఎంపీవో మలహరి, తదితరులున్నారు.

విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పాఠశాలల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎల్లారెడ్డి డీఎల్‌పీవో సురేందర్‌ సూచించారు. నాగిరెడ్డిపేట కస్తూర్భా పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల, విద్యార్థినుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే తాండూర్‌ జీపీ కార్యాలయంలో పలు రికార్డులను, గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పలు సూచనలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement