
ఫీజుల దోపిడీని అరికట్టాలి
కామారెడ్డి టౌన్: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి జి. సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్లో విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. డీఈవో ఎస్.రాజుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ..నర్సరీ, ఎల్కేజీలకే రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. నాయకులు సాయికుమార్, శేఖర్, ప్రశాంత్, రాకేష్ తదితరులున్నారు.
గుర్తింపులేని పాఠశాలలపై
చర్యలు తీసుకోవాలి
జిల్లాలో గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ, స్కూల్ ఆవరణలోనే బ్యాగులు, బుక్స్, ఇతర సామగ్రి విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నా జిల్లా విద్యా శాఖాధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నాయకులు రాజు, మహేష్ ఉన్నారు.