
వాహనాల వేలం వాయిదా
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఎకై ్సజ్ కార్యాలయంలో మంగళవారం వాహనాల వేలంను వాయిదా వేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ సుందల్ సింగ్ తెలిపారు. ఎల్లారెడ్డి ఎకై ్సజ్ కార్యాలయంలో వ్యాగన్ఆర్ కారు, గ్లామర్ బైకుకు సంబంధించి వాహనాల వేలం నిర్వహించారు. వేలానికి ఇద్దరు వ్యక్తులు మాత్రమే హాజరు కాగా ప్రభుత్వం నిర్ధారించిన ధర రాకపోవడంతో వాయిదా వేశారు. ఎల్లారెడ్డి ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్, ఎస్సై శరత్కుమార్, తదితరులున్నారు.
మంత్రి సీతక్కను కలిసిన
జిల్లా కాంగ్రెస్ నేతలు
కామారెడ్డి టౌన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, నాయకులు పంపరి శ్రీనివాస్, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, సాయిబాబా, సలీం, జూలూరి సుధాకర్ తదితరులున్నారు.
రేపు ఒలింపిక్ డే రన్
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలో గురువా రం ఒలింపిక్ డే రన్ నిర్వహించనున్నట్లు జి ల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి కరు ణాకర్రెడ్డి తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కామారెడ్డి జి ల్లా పరిషత్ బాలుర ఉన్న త పాఠశాల వద్ద రన్ ప్రారంభమవుతుందని, ఇందిరాగాంధీ స్టేడి యం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. క్రీడాభిమానులు, విద్యార్థులు, యువకులు ఒలింపిక్ రన్లో పాల్గొనాలని కోరారు.

వాహనాల వేలం వాయిదా