యూనిఫాం కుట్టు కూలి చెల్లించేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

యూనిఫాం కుట్టు కూలి చెల్లించేదెప్పుడో?

Apr 28 2025 12:47 AM | Updated on Apr 28 2025 12:47 AM

యూనిఫాం కుట్టు కూలి చెల్లించేదెప్పుడో?

యూనిఫాం కుట్టు కూలి చెల్లించేదెప్పుడో?

బిచ్కుంద(జుక్కల్‌): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాం అందిస్తోంది. గతేడాది యూనిఫాం కుట్టు చార్జీలు ప్రభుత్వం కొన్ని చెల్లించింది. సుమారు రూ.45 లక్షలు మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో అందించిన యూనిఫాంలు కొందరు విద్యార్థులకు టైట్‌, మరికొందరికి లూజ్‌, చిన్న పెద్దగా ఇచ్చారు దీంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం యూనిఫాం కుట్టే బాధ్యతను స్థానిక మహిళా సంఘాల సభ్యులకు అప్పగించింది. వారు పాఠశాలకు వెళ్లి విద్యార్ధుల కొలతలు తీసుకొని కుట్టారు. ఒక్కో జతకు రూ. 50 చెల్లిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించగా.. అనంతరం రూ.75 చెల్లిస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. గత ఏడాది కుట్టిన కూలీ రూ.50 తోనే చెల్లించింది ఇంకా జతకు రూ. 25 చెల్లించాల్సి ఉంది. జిల్లాలో సుమారు రూ.45 లక్షలు పాత కుట్టు బకాయిలు చెల్లిస్తేనే కొత్త యూనిఫాం కుడుతామని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అప్పులు తీసుకొని కుట్టే వారికి చార్జీలు చెల్లించామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని వారు కోరుతున్నారు.

కొత్త యూనిఫాం కోసం మండలాలకు

చేరుతున్న క్లాత్‌...

పాఠశాలలు ప్రారంభం కాకముందే అన్ని పాఠశాలలకు యూనిఫాంలు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థులకు రెండు జతలు ఇవ్వనున్నారు. జిల్లాలో 49,054 బాలికలు, 45,279 బాలురు మొత్తం 94,333 మంది విద్యార్థులకు యూనిఫాం అందించనున్నారు. జిల్లా కేంద్రం నుంచి యూనిఫాం క్లాత్‌ మండలాలకు పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి కూడా మహిళా సంఘాల సభ్యులకు కుట్టే బాధ్యత అప్పగిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లి కొలతలు తీసుకుంటున్నారు ఒక జతకు రూ.75 చెల్లిస్తామని అధికారులు అంటున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతలు ఇవ్వనున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు బాలికలకు యూనిఫాం ఒకే విధంగా ఉండేలా మార్పులు చేశారు. 6 నుంచి గురుకులాల ఇంటర్‌ వరకు బాలుర విదార్థులకు ప్యాంట్లు, షర్టులు ఇవ్వనున్నారు. వీటి పరిశీలన బాధ్యత ఎంఈవోలకు అప్పగించనున్నారు. మే నెలాఖరులోగా యూనిఫాంలు పూర్తి చేసి బడిబాటకు ముందే పాఠశాలలకు చేరేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తరగతులకు పిల్లలు కొత్త దుస్తుల్లో హాజరయ్యేలా కార్యచరణ రూపొందించినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.

జిల్లాలో పాత బకాయి రూ.45 లక్షలు

పాత బకాయిలు చెల్లిస్తేనే

కొత్త దుస్తులు కుడుతామంటున్న

మహిళా సంఘాల సభ్యులు

జిల్లాలో 94,333 విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement