ఉత్సాహంగా ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల బాలబాలికల కరాటే జట్ల కోసం ఎంపికలు నిర్వహించారు. జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ఎంపికలను ప్రారంభించారు. జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి మాట్లాడుతూ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 300 మంది హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, పరుశరాముడు, శశికళ, ఉమ్మడి జిల్లాలోని కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.


