ఇప్పటికే వర్షాలు లేక వేసిన పంటలు పండుతాయో.. ఎండుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా సంఘాలకు ఉచితంగా ఎరువులను రవాణా చేయడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ద్వారా రైతులపై మరింత భారం పడుతుంది.
– మెక్కొండ రాంరెడ్డి, అలూరు, రాయికల్(మం)
రైతులపై భారం మోపుతున్న ఎరువుల రవాణా జీవోను ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే సంఘాలు అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. లారీలను కిరాయికి పెట్టి ఎరువులు తెచ్చే పరిస్థితి లేనందున, ఎరువుల విక్రయం నుంచి వైదొలిగే అవకాశం ఉంది.
– పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు, జగిత్యాల


