హామీలన్నీ నెరవేర్చుతాం
ధర్మపురి: మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురిలో 15 వార్డులకు 15 గెలుచుకున్న సందర్భంగా శనివారం స్థానిక శ్రీలక్ష్మినృసింహస్వామి దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నృసింహుని ఆశీస్సులతోపాటు ప్రజల ఆ శీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం విజ యం వరించిందని, ఈ తీర్పుతో బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. మాజీ జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, నాయకులు, కార్యకర్తలున్నారు.
శివపార్వతుల కళ్యాణం
జగిత్యాలటౌన్: మహాశివరాత్రి సందర్భంగా శనివారం పట్టణంలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర అంగరంంగ వైభవంగా నిర్వహించారు. తిగుళ్ల విషుశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో ముసిపట్ల లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హామీలన్నీ నెరవేర్చుతాం
హామీలన్నీ నెరవేర్చుతాం


