
‘మత్తు’తో నైతిక విలువల పతనం
● ఎస్పీ అశోక్కుమార్
జగిత్యాలఅగ్రికల్చర్: మత్తు పదార్థాల వినియోగంతో నైతిక విలువలు పతనం అవుతున్నాయని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. పొలాస వ్యవసాయ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత మత్తుబారిన పడొద్దని సూచించారు. ఏకాగ్రత, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో రూపొందించిన మాదక ద్రవ్యాల నివారణ పోస్టర్ ఆవిష్కరించారు. వ్యవసాయ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సైదా నాయక్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కార్యక్రమం కో–ఆర్డినేటర్ పర్లపల్లి రాజు, సీఐలు శ్రీనివాస్, కృష్ణారెడ్డి, ఎస్సై సదాకర్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలి
జగిత్యాలక్రైం: సమస్యలు వస్తే పరిష్కారం దిశగా ఆలోచించాలని ఎస్పీ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మానసిక నిపుణులు అశోక్కుమార్ మానసిక ఆరోగ్య అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మానసికంగా ఆరోగ్యం ఉండాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది వివిధ మానసిక ఒత్తిళ్లపై అశోక్కుమార్ అవగాహన కల్పించారు. అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీ రఘుచందర్, సీఐలు కిరణ్కుమార్, వేణు, వేణుగోపాల్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, శ్రీధర్, రఫీక్ఖాన్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.