
ధాన్యం త్వరితగతిన తరలించాలి
మల్యాల: తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మండలంలోని ముత్యంపేట, మల్యాల, రామన్నపేట, నూకపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం సందర్శించారు. రైతులు, కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని, జాప్యం లేకుండా లారీల్లో తరలించాలని సూచించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్ఏ పీడీ రఘువరణ్, డిప్యూటీ తహసీల్దార్ నీతా, ఆర్ఐ తిరుపతి, రైతులు పాల్గొన్నారు.