లేఔట్‌ నిబంధనలు బేఖాతరు | - | Sakshi
Sakshi News home page

లేఔట్‌ నిబంధనలు బేఖాతరు

Apr 21 2025 8:01 AM | Updated on Apr 21 2025 8:01 AM

లేఔట్‌ నిబంధనలు బేఖాతరు

లేఔట్‌ నిబంధనలు బేఖాతరు

మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలో వెంచర్ల ఏర్పాటులో రియల్‌ వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న వ్యాపారులు.. వాటి విషయంలో ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొ క్కుతున్నారు. లేఅవుట్‌ అనుమతులు పొందకుండానే దర్జాగా ప్లాట్లు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొ మ్ము చేసుకుంటున్నారు. అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేయాల్సిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అఽ దికారులు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం పంచాయతీ నుంచి ము న్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన మెట్‌పల్లిలో ఇంతవరకు ఒక్కటి తప్ప మిగతావన్నీ అక్రమ వెంచర్లే కావడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

నిబంధనలు ఇవే..

● వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించడానికి ముందుగా రెవెన్యూ అధికారులకు నాలా కింద దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలి.

● తర్వాత డీటీసీపీ (డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌, కంట్రీ ప్లానింగ్‌)కి దరఖాస్తు చేసుకోవాలి. ఈ శాఖ ఆమోదం పొందాలంటే ప్లాట్లుగా విభజిస్తున్న భూమిలో ప్రజాఅవసరాల నిమిత్తం పది శాతం స్థలాన్ని స్థానిక సంస్థలకు ఇవ్వాలి.

● అందులో ఏర్పాటు చేసే రహదారులు కనీసం 33 ఫీట్లు ఉండాలి.

జరుగుతోందిలా..

● పట్టణంలో హన్మాన్‌నగర్‌, సాయిరాంకాలనీ, టీచర్స్‌ కాలనీ, వెంకట్రావ్‌పేట, ఆరపేట, బీడీ కాలనీ, వేంపేట రోడ్‌, వెల్లుల్ల రోడ్‌, రాంనగర్‌ శివారులో ఉన్న వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేస్తున్న వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు.

● కేవలం నాలా కింద బదలాయింపునకే పరిమితమవుతున్నారు.

● స్థానికంగా భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా రియల్‌ వ్యాపారులు డీటీసీపీ అనుమతితో వెంచర్లు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు.

● అధికారుల ఉదాసీనత కూడా వీరికి దోహదం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

● లేఅవుట్‌ లేకుండానే భూములను ప్లాట్లుగా విభజించి బహిరంగంగానే విక్రయాలు జరుపుతున్నారు. ఆ భూముల్లో కేవలం 21, 24 ఫీట్లతో మాత్రమే రహదారులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

● ఈ సమస్య వల్ల ఇప్పటికే చాలా కాలనీల్లో రహదారులు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు మున్సిపాలిటీ ఆధీనంలో స్థలాలు లేకపోవడంతో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల్లో వసతులు కల్పించడం కష్టంగా మారింది.

హద్దు రాళ్ల తొలగింపునకే పరిమితం

● అక్రమ వెంచర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అలా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.

● ఎక్కడైనా వ్యవసాయ భూముల్లో ప్లాట్లను ఏర్పాటు చేస్తే అధికారులు అక్కడి వెళ్లి అందులోని హద్దురాళ్ల తొలగింపునకే పరిమితమవుతున్నారు. తర్వాత జరిగే లావాదేవీలను నిలువరించే ప్రయత్నాలు చేయడం లేదు.

● అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా నిబంధల ప్రకారం రావాల్సిన పది శాతం స్థలాలను కోల్పోవాల్సి వస్తోంది.

ప్రజలు కొనుగోలు చేయవద్దు

లేఅవుట్‌ అనుమతులు లేని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేయవద్దు. అలాంటి వాటిని కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇటీవల కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను ఏర్పాటు చేస్తే అడ్డుకున్నాం. ఇటీవల ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. అలాంటి వాటిని మినహాయిస్తే మిగతా వాటిలో వెంచర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం.

– మోహన్‌,

మున్సిపల్‌ కమిషనర్‌

వ్యవసాయ భూముల్లో యథేచ్ఛగా అక్రమ వెంచర్లు

వేలాది ప్లాట్లు అక్రమంగా క్రయవిక్రయాలు

రెండు దశాబ్దాల్లో కేవలం ఒక్కచోటనే డీటీసీపీ అనుమతి

మున్సిపల్‌ ఆధీనంలో స్థలాలు లేక వసతుల కల్పనకు ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement