
కోపెన్హాగన్:డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. బుధవారం(అక్టోబర్2)ఉదయం జరిగిన ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డెన్మార్క్ పోలీసులు ప్రకటించారు.
పేలుళ్లపై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధవాతారణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుళ్లు చోటు చేసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్ల దాడులు