కశ్మీర్‌.. పాక్‌దంటూ తప్పుడు మ్యాప్‌.. వెంటనే క్షమాపణలు కోరిన ఇజ్రాయెల్‌ | Israel Defence Forces Apologises For Wrong Map Of Jammu And Kashmir After Criticism, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌.. పాక్‌దంటూ తప్పుడు మ్యాప్‌.. వెంటనే క్షమాపణలు కోరిన ఇజ్రాయెల్‌

Jun 14 2025 11:07 AM | Updated on Jun 14 2025 1:00 PM

Israel Defence Forces Wrong map of Jammu and Kashmir

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ను పాకిస్తాన్‌కు చెందినదిగా  గుర్తిస్తూ, భారత అంతర్జాతీయ సరిహద్దుల తప్పుడు మ్యాప్‌ను ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎస్‌) కొద్దిసేపటికి తమ పొరపాటును గమనించి, భారత్‌ను క్షమాపణలు కోరాయి. ఈ మ్యాప్‌లో సరిహద్దులను ఖచ్చితంగా చిత్రీకరించలేదని అని ఐడీఎఫ్ అంగీకరించింది. కొందరు భారతీయులు చేసిన ట్వీట్‌ల దరిమిలా, ఐడీఎఫ్ ఈ విధంగా స్పందించింది.

భారతీయుల మండిపాటు..
పలువురు యూజర్లు మ్యాప్‌లోని లోపాన్ని ఎత్తి చూపుతూ, ఇజ్రాయెల్ సైన్యం వెంటనే ఈ పోస్ట్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. కొందరైతే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తమ పోస్టులకు  ట్యాగ్ చేశారు. ఇండియన్ రైట్ వింగ్ కమ్యూనిటీకి చెందిన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో వచ్చిన ఒక ట్వీట్‌పై ఇజ్రాయెల్ రక్షణ దళాల స్పందించాయి. ఈ మ్యాప్ సరిహద్దులను ఖచ్చితంగా  చూపించడంలో విఫలమైంది. జరిగిన తప్పిదానికి  క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌ రక్షణ దళాల పోస్ట్  వెలువడిన 90 నిమిషాల తర్వాత  ఈ పరిణామం చోటుచేసుకుంది.
 

భారత్‌ ఏనాడో స్పష్టం..
ఐడీఎఫ్ పోస్ట్‌ చేసిన తప్పుడు మ్యాప్‌పై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. దశాబ్దాలుగా పాకిస్తాన్, చైనాలు  ఆక్రమించుకున్న జమ్ముకశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు దేశంలో అంతర్భాగమని  భారత్‌ ఏనాడో స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని దీనిని పునరుద్ఘాటించారు. గత కొన్నేళ్లుగా భారత్‌- ఇజ్రాయెల్ స్నేహపూర్వక సంబంధాన్ని  కొనసాగిస్తున్నాయి. 2017లో  ప్రధాని మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. ఈ నేపధ్యంలో భారతదేశ సరిహద్దులకు సంబధించిన తప్పుడు మ్యాప్‌ను ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది.

 

ఇజ్రాయిల్‌ క్షిపణి సామర్థ్యం పరిధిలో..
‘ప్రపంచానికున్న పెను ముప్పు ఇరాన్‌.. ఇదొక్కటే ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు. ఇది ప్రారంభం మాత్రమే’ అంటూ ఇజ్రాయెల్ సైన్యం పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని పలు ప్రాంతాలను చూపించే మ్యాప్‌ను జత చేసింది. దీనిలో భారత సరిహద్దులను తప్పుగా చూపింది. ఈ మ్యాప్‌లో ఇరాన్ చుట్టూ ఎరుపు రంగు  వృత్తాలు ఉన్నాయి. ఇవి టెహ్రాన్‌కున్న క్షిపణుల పరిధిని సూచిస్తాయి. సౌదీ అరేబియా, ఆఫ్రికాలో లిబియా, ఇథియోపియా, ఆసియాలో భారత్‌, చైనా, ఐరోపాలో రొమేనియా, బల్గేరియా, రష్యా, టర్కీలు ఈ వృత్తాలలో కనిపిస్తున్నాయి. ఈ మ్యాప్‌ వివాదిస్పదంగా మారింది.

 

 ఇది కూడా చదవండి: Air India Crash: నాడు ‘ఎంపరర్ అశోక’.. నేడు ‘డ్రీమ్‌ లైనర్‌’.. అదే విషాదం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement