నికోసియా: ఐరోపా దేశం సైప్రస్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ( ఆదివారం) మధ్యదరా సముద్రంలో 270 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీబోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. వివరాలు తెలుసుకున్న సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.
అక్కడి స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కిరెనియా పోర్టు నుండి బయిలుదేరిన కొద్దిసేపటికే బోటులోకి నీరు రావడం ప్రారంభమైంది. అనంతరం కొద్ది సేపటికే నదిలో మునిగిపోయిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు.ప్రమాదంలో ఇదివరకే 237 మందిని రక్షించారని మిగతా 24 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


