
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ దేశంలోని ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఒకవైపు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల మధ్య యూనస్ దేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోయేదీ వెల్లడించారు.
2025లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న తిరుగుబాటు, షేక్హసీనా దేశం విడిచిపెళ్లిపోయిన దరిమిలా ఆ దేశానికి ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనపై గత కొంతకాలంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఆయన దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2026 ఏప్రిల్లో జరుగుతాయని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజునైనా ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.
గత ఏడాది బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ కోటా వ్యవస్థలో సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ, రాజకీయ తిరుగుబాటు చోటుచేసుకుంది. కాగా గత నెలలో మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), డిసెంబర్ 2025 నాటికల్లా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, వివాదాస్పద సలహాదారులను తొలగించాలని ముహమ్మద్ యూనస్ను కోరింది.
ఇది కూడా చదవండి: ‘సిమ్లా ఒప్పందం చావలేదు’.. నాలిక కరుచుకున్న పాకిస్తాన్