సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాల మేరకు ఫుడ్సేఫ్టీ అధికారులు బుధవారం నుంచి 69 మిఠాయి దుకాణాలను తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్లక్ష్యంగా షాపులు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. కనీసం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా లేని పది దుకాణాలకు తాళాలు వేసి సీల్ చేశారు. అధికారులు మూసివేసిన మిఠాయి దుకాణాల్లో శ్రీలక్ష్మి మిఠాయి భండార్(ఎల్బీ నగర్), శ్రీరాఘవేంద్ర స్వీట్ హౌస్ అండ్ బేకరి(ఎల్బీ నగర్), శ్రీసాయిరామ్ హాట్చిప్స్ అండ్ స్వీట్స్ (ఎల్బీ నగర్), న్యూబాలాజీ మిఠాయి భండార్ అండ్ హాట్ చిప్స్ (కొత్తపేట), సూపర్ స్వీట్స్(అలీజా కోట్ల), రామ్స్వరూప్ మిఠాయి భండార్ (రామంతాపూర్), ప్రేమ్ స్వీట్స్ (శేరిలింగంపల్లి), శ్రీబాలాజీ ఛగన్లాల్ మిఠాయి భండార్ (మల్లికార్జున నగర్), జోధ్పూర్ మిఠాయివాలా (మచ్చ బొల్లారం), శ్రీరాఘవేంద్ర హాట్చిప్స్ (బీరంగూడ) ఉన్నాయి.