నేడు ‘కాళేశ్వరం’ కమిషన్‌ నివేదిక | Ghose Commission to submit Kaleswaram report On July 31 | Sakshi
Sakshi News home page

నేడు ‘కాళేశ్వరం’ కమిషన్‌ నివేదిక

Jul 31 2025 3:19 AM | Updated on Jul 31 2025 5:06 AM

Ghose Commission to submit Kaleswaram report On July 31

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

నివేదిక తీసుకునేందుకు గురువారం ఉదయం 9 గంటలకు తమ కార్యా­లయానికి రావాలని నీటి­పారుదల శాఖ ము­ఖ్య­కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను కమిషన్‌ కోరింది. జస్టిస్‌ చంద్రఘోష్‌ ఆయనకు సీల్డ్‌ కవర్‌లో నివేదికను అందించనున్నా­రు. కాళేశ్వరం ప్రాజె­క్టు­లో అవినీతి ఆరో­పణలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. 115 మంది సాక్షులను విచారించిన కమిషన్‌ తుది నివేదికను సిద్ధం చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement