
బడి వైపు అడుగులు
బడి గంటలు మోగాయి. గురువారం నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇన్నాళ్లూ ఆటా పాటలతో సరదాగా గడిపిన పిల్లలు మళ్లీ బడిబాట పట్టారు. ఉదయం నుంచే రోడ్లపై సందడి కనిపించింది. తొలిరోజు కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ వరకు వచ్చి వదిలివెళ్లారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ప్రవేశ ద్వారం వద్ద విద్యార్థులకు చాకెట్లు, పెన్సిళ్లు, బెలూన్లు, పూలు అందించి స్వాగతం పలికాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. – సాక్షి, సిటీబ్యూరో