
ఎమ్మెల్యే రాజాసింగ్
అబిడ్స్: భవిష్యత్తులో పాకిస్థాన్లోనూ హిందూ జెండాను ఎగరవేస్తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అఖండ భారత్ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతామన్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం ఎమ్మెల్యే రాజాసింగ్ విశాల్ శోభాయాత్ర నిర్వహించారు. బేగంబజార్, ఛత్రి చౌరస్తాల్లో అడ్డ యాదవ్ ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి ఆయన మాట్లాడుతూ.. మొగలులు దేశంలోని 40 వేల మందిరాలను కూల్చివేశారని, తాము కేవలం మూడు మందిరాలను మాత్రమే ఇవ్వాలని చట్టప్రకారం కోరుతున్నామన్నారు. ఎప్పటికీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగదని, ఊహించుకున్న వారిని అయోధ్య రామ మందిర నిర్మాణం, రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వారికి చెంపపెట్టు అన్నారు. 2027 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా తీర్చిదిద్దుతామని, భవిష్యత్తులో పాకిస్థాన్లో కూడా హిందూవుల జెండాను ఎగరవేస్తామన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ పాటతో అందరిని ఆకట్టుకున్నారు.