
సాక్షి, సిటీబ్యూరో: 2023 హజ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు వెల్లండించారు. సోమవారం నుంచి హజ్ క్యాంప్ ప్రారంభమైంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు సిబ్బందికి డ్యూటీలు ఖారారు చేశారు. ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు యాత్రకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. హజ్ హౌస్ను మినీ ఎయిర్పోర్టుగా మార్చారు. యాత్రకు సంబంధించిన అన్ని ప్రక్రియలు హజ్ హౌస్లోనే పూర్తి చేస్తారు. లగేజ్, బోర్డింగ్, ఇమిగ్రేషన్, కస్టమ్ తదితర అన్ని కౌంటర్లు హజ్హౌస్లోనే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 వేల మంది హజ్యాత్రకు వెళ్లనున్నారు.
గోల్కొండ కోటలో జి–20 ప్రతినిధుల సందడి
గోల్కొండ: నగరంలో జరుగుతున్న 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జీ–20 ప్రతినిధులు సోమవారం గోల్కొండ కోటను సందర్శించారు. 150 మంది వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు కోటను సందర్శించారు. కేంద్రపురాతత్వ సర్వేక్షణశాఖ హైదరాబాద్ రీజియన్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ స్మితా ఎస్. కుమార్ ఈ బృందానికి స్వాగతం పలికారు. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు గోల్కొండ కోట అందాలకు ముగ్ధులయ్యారు. కోటలో జరిగే లైట్ అండ్ షోను తిలకించారు.
యువకుల ‘నేచర్ ట్రెక్’...
సాక్షి, సిటీబ్యూరో: ప్రకృతితో మనిషి మనుగడ సాగించే విధానం పైనే తన భవిష్యత్ ఆధారపడి ఉంటుందని యంగిస్థాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అరుణ్ డేనియల్ ఎల్లమటి తెలిపారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యంగిస్థాన్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఖాజాగూడలో పర్యావరణ సంరక్షణ కోసం ప్రత్యేకంగా ట్రెక్ను నిర్వహించారు. ఈ ట్రెక్లో నగరానికి చెందిన పలువురు యువ పర్యావరణవేత్తలు పాల్గొని ప్లాస్టిక్తో పాటు పర్యావణానికి హాని చేసే ఇతర వ్యర్థాలను తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు అరుణ్ డేనియల్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కలుషితం చేసే పదార్థాలను నియంత్రించడంతో పాటు గాలిలోని కార్బన్ స్థాయిలను తగ్గించడంపై అందరూ దృష్టి సారించాలన్నారు.
నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తాం
లక్డీకాపూల్ : గతంలో నిమ్స్ యాజమాన్యం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం తమ డిమాండ్ల సాధన కోసం ఉదయం 11 గంటల వరకు కార్మికులెవరూ విధులను హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో యూనియన్ నాయకులను చర్చలకు పిలిచిన ఇంచార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రిటైరైన కార్మికులకు ఉచితంగా వైద్యం సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. అదే విధంగా 2023 ఏప్రిల్ నుంచి పెరిగిన 74 వీడిఏ పాయింట్ల అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కాంట్రాక్ట్ కార్మికులకు హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు ఎం వెంకటేష్ మాట్లాడుతూ నిమ్స్ యాజమాన్యం ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు.
ఈ నెల 7 నుంచి 22 వరకు హజ్ యాత్ర
నగర శివార్లలో వ్యర్థాల తొలగించిన యువత...


మాట్లాడుతున్న నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్