
బంజారాహిల్స్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కల్నరీ ఆర్ట్స్ (ఐఐహె చ్ఎంసీఏ) కాలేజీకి అరుదైన గుర్తింపు దక్కిందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ గౌతమ్ కరింగి తెలిపారు. ప్రముఖ అవుట్ లుక్ ఇండియా మేగజైన్ నిర్వహించిన సర్వేలో దేశంలోనే ఈ కాలేజీకి రెండో ర్యాంకును కేటాయించిందని చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం జూబ్లీహిల్స్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు పలు రకాల వంటకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సూరజ్ మాట్లాడుతూ ఏటా తమ కాలేజీ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రసిద్ధిగాంచిన హోటళ్లు, రెస్టారెంట్లకు 400 మంది చెఫ్లను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశ, విదేశాలకు చెందిన పలు రకాల వంటకాలను వండి, ప్రదర్శించారు.
వివిధ వంటకాలతో విద్యార్థులు, అధ్యాపకులు