అధికారులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Aug 13 2025 7:38 AM | Updated on Aug 13 2025 7:38 AM

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

న్యూశాయంపేట: రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షా ల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ నుంచి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్‌, ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ వీసీలో వరంగల్‌ జిల్లా నుంచి కలెక్టర్‌ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అ న్నారు. కలెక్టరేట్‌ నుంచి ఆమె జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, తహసీల్దార్లతో మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని ఆదేశించారు. తమ మండలాల పరిధిలో జలమయమయ్యే ప్రాంతాలను గుర్తించి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని చెప్పారు. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని తెలిపారు. టె లికాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement