కొడుకు హత్యకు గురయ్యాడని.. | - | Sakshi
Sakshi News home page

కొడుకు హత్యకు గురయ్యాడని..

Aug 7 2025 8:10 AM | Updated on Aug 7 2025 11:17 AM

కొడుకు హత్యకు గురయ్యాడని..

కొడుకు హత్యకు గురయ్యాడని..

నల్లబెల్లి: కొడుకు హత్యకు గురయ్యాడనే మనస్తాపంతో తండ్రి అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోత్‌ కోక్యా(65), వాలి దంపతుల చిన్న కుమారుడు కొమ్మాలు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో గత ఏప్రిల్‌ 12న హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి కోక్యా మనస్తాపానికి గురై ఆహారం మానేశాడు. దీంతో కొంతకాలంగా అనారోగ్యానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం కుటుంబ సభ్యులతో కుమారుడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మంచంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందాడు.

మనస్తాపంతో తండ్రి మృతి

మూడు చెక్కలపల్లిలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement