
పసుపు రైతుల ఆందోళన
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేశారు. ధర పెంచేవరకూ పసుపు అమ్మమని తేల్చిచెప్పారు.
● విద్యారణ్యపురి: హనుమకొండ సుబేదారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 196 మంది విద్యార్థులున్నారు. గురువారం సాక్షి విజిట్ చేయగా 110 మంది హాజరయ్యారు. తరగతి గదులు సరిపడా ఉన్నాయి. కానీ, మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేవు. గతంలో మన ఊరు మన బడి కింద రూ.4లక్షల వ్యయంతో బాలురకు, బాలికలకు వేర్వేరుగా రెండు యూనిట్ల టాయ్లెట్ల నిర్మించారు. కానీ, నిధులు విడుదల చేయకపోవడంతో అసంపూర్తిగానే వదిలివేశారు. పాఠశాల ఆవరణ లోతుగా ఉండడంతో వర్షం వస్తే నీళ్లు నిలిచిపోతున్నాయి. మొరం పోయాల్సిన అవసరం ఉంది. ఈ పాఠశాలలో హెచ్ఎంతోపాటు ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.