
గడువులోగా పనులు పూర్తి చేయాలి
● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
వరంగల్ అర్బన్/ఖిలా వరంగల్: వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని స్విమ్మింగ్ పూల్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయిలో ఆమె పనులు పరిశీలించారు. నాణ్యతతో పనులు చేయాలని సూచించారు. ప్లానిటోరియాన్ని కమిషనర్ పరిశీలించారు. శివనగర్లోని మెట్ల బావిని, చింతగట్టు వద్ద పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్ని పర్యవేక్షించారు. ఆమె వెంట ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, డీఈ రాజ్కుమార్, ఏఈలు శ్రీకాంత్, మోజామిల్, హబీబ్, నరేశ్ తదితరులున్నారు.