
బనకచర్లతో ఎడారవ్వనున్న ఉమ్మడి జిల్లా
హన్మకొండ: గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఏడారిగా మారుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల గురించి తెలియని రేవంత్రెడ్డి తెలంగాణ నీటి వనరులను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. చిన్న పగుళ్ల సాకు చూపి కాళేశ్వరం కూలిపోయిందన్నారని. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే రైతుల పొలాలను ఎండగొట్టిందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా తాగు, సాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించుకున్న, అభివృద్ధి చేసుకున్న పాకాల, గణపురం, లక్నవరం రిజర్వాయర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని పడుతున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్యాయం జరుగుతున్నా మంత్రులు సీతక్క, సురేఖ, ఎమ్మెల్యేలు కనీసం నోరు మెదపడం లేదని తూర్పారబట్టారు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు నీటి దోపిడీకి గోదావరి బనకచర్ల కడుతుంటే రేవంత్ రెడ్డి ఎలా అడ్డుకుంటాడని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, నాయకులు ఉడతల సారంగపాణి, జోరిక రమేశ్, తాళ్లపెళ్లి జనార్దన్ గౌడ్, నార్లగిరి రమేశ్, పులి రజనీకాంత్, బండి రజనీ కుమార్, శోభన్ కుమార్, నయీముద్దీన్, సల్వాజీ రవీందర్ రావు, జానకి రాములు, అఫ్జల్, రామ్మూర్తి, మూటిక రాజు, రాజ్ కుమార్, శరత్ చంద్ర, వీరస్వామి, రాకేశ్, శ్రవణ్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి