ఖిలా వరంగల్: అక్రమంగా తరలిస్తున్న రూ.12.80 లక్షల విలువైన 50 బస్తాల పాన్ మసాలా (గుట్కా) ప్యాకెట్లు పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసిన ఆటో, కంటైనర్ను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. వరంగల్ ఉర్సు గుట్ట వద్ద కంటైనర్ నుంచి ఆటోలోకి 25 బస్తాలు విమల్ కంపెనీకి చెందిన పాన్ మసాలా ప్యాకెట్లు ఎగుమతి అవుతున్నాయని టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్కు సమాచారం అందింది. దీతో ఏసీపీ ఆదేశాల మేరకు గురువారం ఉదయం వరంగల్ ఉర్సు గుట్ట వద్ద టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కంటైనర్తోపాటుఆటోలో తనిఖీ చేయగా.. ఎలాంటి అనుమతులు లేని 50 బస్తాల పాన్ మసాలా ప్యాకెట్లు కనిపించగా పట్టుకున్నారు. కర్ణాటక తుంకూర్లోని శివ ఎంటర్ప్రైజెస్ నుంచి తెలంగాణలోని హుజూర్నగర్కు చెందిన తవక్కల్ ట్రేడర్స్ పేరుతో బస్తా పాన్ మసాలాకు వేబిల్లు చూపుతూ.. మిగతా 49 బస్తాలకు అనుమతి లేకుండా వరంగల్ ఉర్సు గుట్ట వద్ద ఆటోలోకి 25 బస్తాలు ఎగుమతి చేస్తుండగా పట్టుకున్నారు. అనంతరం కర్ణాటక గుల్బర్గా మొఘచించోలికి చెందిన బీమ్రెడ్డి, ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు విద్యానగర్ కాలనీకి చెందిన గోపాల మధు, వరంగల్ కాశిబుగ్గ శాంతినగర్ చెందిన ఎండి. జమీల్ హైమద్ అదుపులోకి తీసుకుని తదిపరి విచారణ నిమిత్తం మిల్స్కాలనీ పోలీసులకు కేసును అప్పగించినట్లు టాస్క్ఫోర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది, మిల్స్కాలనీ పోలీసులు పాల్గొన్నారు.
● ముగ్గురి అరెస్ట్