
గుంటూరు వైద్య కళాశాల విద్యార్థుల ఎంపిక
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కీంకు గుంటూరు మెడికల్ కాలేజ్కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. తమ పరిశోధనా ప్రాజెక్టుల ఆధారంగా ఈ సంవత్సరానికి వారిని ఎంపిక చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంలో ఈ స్కీం అమలు చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిపాదనలను కాలేజ్, విశ్వవిద్యాలయ స్థాయి కమిటీలు పరిశీలించాక ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థులకు మంగళవారం రూ. 10 వేల వంతున చెక్కులను పరిశోధన గ్రాంటుగా అందించారు. ఈ నిధులు ప్రాజెక్ట్ నిర్వహణ, డేటా సేకరణ. ఇతర అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ పథకం ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు పరిశోధన చేసి, తమ ప్రతిభను విశ్వవిద్యాలయ స్థాయిలో చాటనున్నారు. ఇది విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమేకాకుండా భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదగడానికి సహాయపడుతుందని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.సుందరాచారి అన్నారు. ఎంపికై న విద్యార్థులను గుంటూరు మెడికల్ కాలేజ్ అధ్యాపకులు అభినందించారు.