శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి | - | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి

Jun 27 2025 4:22 AM | Updated on Jun 27 2025 4:22 AM

శ్రీవ

శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి

నగరంపాలెం: స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బృందావన శ్రీనివాసుడిని గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి సభ్యులను, భక్తులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్‌ మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమా మహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టా ప్రభాకరరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

పవర్‌ లిఫ్టర్‌ సాదియాకు బంగారు పతకం

మంగళగిరి: ఈ నెల 22వ తేదీ నుంచి కర్ణాటకలో జరుగుతున్న జూనియర్‌ నేషనల్‌ ఎక్యూప్డ్‌ ఉమెన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్‌ బంగారు పతకం కై వసం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయ భాస్కరరావు, షేక్‌ సంధానిలు గురువారం తెలిపారు. 57 కేజీల స్క్వాడ్‌ విభాగంలో 200.5 కేజీలు, డెడ్‌ లిఫ్ట్‌లో 185.5 కేజీల బరువులు ఎత్తి ఆల్మాస్‌ రికార్డు సృష్టించారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆల్మాస్‌ను పలువురు అసోసియేషన్‌ ప్రతినిధులు అభినందించినట్లు వెల్లడించారు.

మొహరం వేడుకలు ప్రారంభం

పొన్నూరు: మొహరం పండుగ వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. హాజరత్‌ మొహమ్మద్‌ వారి మనుమలు హాజరత్‌ ఇమామే హసన్‌, హాజరత్‌ ఇమామే హుస్సేన్‌ త్యాగాలను స్మరిస్తూ పట్టణంలోని మొల్లా దహెరా మసీదు వద్ద పీర్ల చావిడిలో పీర్లను పూలతో అలంకరించారు. మేళతాళ వాయిద్యాలతో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మొల్లా హైదర్‌, మొల్లా గబ్బర్‌ బాషా, మొల్లా సంధాని, మొల్లా నజీర్‌, మొల్లా ఖలీల్‌ బాషా, మొల్లా జలీల్‌, మొల్లా బాజి, మొల్లా నసీర్‌, మొల్లా రహంతుల్లా, షేక్‌ గౌస్‌, మొల్లా అసద్‌, మొల్లా ఆర్షద్‌, మొల్లా ఇమ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు. మొల్లా కరీమ్‌ పర్యవేక్షించారు. జూలై 4వ తేదీ వరకు వేడుకలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

డీడీఏగా నాగేశ్వరరావు బాధ్యతల స్వీకరణ

కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు (డీడీఏ)గా ఎ. నాగేశ్వరరావు గురువారం జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నాగేశ్వరరావు వైఎస్సార్‌ కడప జిల్లాలో డీడీఏగా పనిచేస్తూ బదిలీపై గుంటూరు వచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు(జేడీఏ)గా పనిచేస్తున్న యు.నరసింహారావు ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. నరసింహారావు రిటైర్‌ అయ్యాక ఎ.నాగేశ్వరరావు ఆయన స్థానంలో కొనసాగనున్నారు.

సత్య సాయిబాబా

ప్రచార రథానికి స్వాగతం

తెనాలి: పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయిబాబా ఆశ్రమ ప్రస్థానం 75 ఏళ్లకు చేరుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ప్రచార రథం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. శ్రీసత్య సాయిబాబా బోధనలను ప్రచారం చేస్తోంది. ఆ క్రమంలో బుధవారం రాత్రి తెనాలి వచ్చిన ప్రచార రథానికి ఘన స్వాగతం లభించింది. భక్తులు పలువురు హారతులిచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. విశ్రాంత పోలీసు అధికారి విఠలేశ్వర్‌, కుమార్‌ పంప్స్‌ ఎండీ కొత్త సుబ్రహ్మణ్యం, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి 1
1/4

శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి

శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి 2
2/4

శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి

శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి 3
3/4

శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి

శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి 4
4/4

శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement