
స్థానికులనూ బయటకు రానివ్వలేదు...
ద్వారకానగర్, ముత్యాలరెడ్డినగర్ తదితర ప్రాంతాల వైపు వెళ్లే చోదకులు, పాదచారులు అమరావతి రోడ్డుపైకి రాకుండా నిలిపివేశారు. ఆయా రహదారుల వద్ద ఒక్కొక్క కానిస్టేబుల్ను నియమించి, రాకపోకలను నియంత్రించారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ర్యాలీ ముగిశాక వర్షం పడటంతో విద్యార్థులు పరుగులు తీశారు. దగ్గర్లోని దుకాణాల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. విద్యార్థులను తరలించిన ప్రైవేట్ బస్లు దూరంగా నిలిపివేయడంతో వర్షంలోనే ముద్దగా తడుస్తూ ముందుకెళ్లారు. కొందరైతే ఫ్లెక్సీలు, ప్లకార్డులు తలపై పెట్టుకుని బయలుదేరారు. మహిళలు తమ పిల్లలను పాఠశాలల నుంచి తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు. సీఎం స్థాయి వ్యక్తి కార్యక్రమాన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు ముగిసే సమయానికి రోడ్డుపై ఏర్పాటు చేసిన తీరుపై నగరవాసులు మండిపడ్డారు. తీరుతెన్ను లేకుండా ఏర్పాట్లు ఉండటం, వర్షం కూడా కురవడంతో గంటల తరబడి రోడ్డుపైనే నానా ఇబ్బందులు పడ్డామని వాపోయారు.