వైద్యులకు క్రీడలతో ఉపశమనం | - | Sakshi
Sakshi News home page

వైద్యులకు క్రీడలతో ఉపశమనం

Jun 27 2025 4:22 AM | Updated on Jun 27 2025 4:22 AM

వైద్యులకు క్రీడలతో ఉపశమనం

వైద్యులకు క్రీడలతో ఉపశమనం

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): వృత్తిపరంగా పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు వైద్యులు నిత్యం క్రీడా సాధన చేయాలని డాక్టర్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (డీఎస్‌సీవో) కార్యదర్శి డాక్టర్‌ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక గుంటూరు మెడికల్‌ అసోసియేషన్‌ భవన సముదాయంలో నిర్వహించిన క్యారమ్స్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పని ఒత్తిడిని అధిగమించడంతోపాటు ఆటవిడుపు కోసం ప్రతి ఏడాది వైద్యుల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు భాగంగా క్యారమ్స్‌తోపాటు క్రికెట్‌, చెస్‌, కల్చరల్‌ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని చెప్పారు. సుమారు 50 మంది పేరొందిన వైద్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో డీఎస్‌సీవో అధ్యక్షుడు డాక్టర్‌ టి.సి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యారమ్స్‌ పోటీలకు ఏపీ క్యారమ్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ జలీల్‌ రిఫరీగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement