ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి

Jun 25 2025 6:58 AM | Updated on Jun 25 2025 6:58 AM

ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి

ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి

ిపడుగురాళ్ల: రైతులు విక్రయించిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించక పోవడం రైతులను మోసం చేయడమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌ విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులకు మే 9 నుంచి ధాన్యం బకాయిలు చెల్లింపులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రబీలో రైతులకు ఇంకా రూ. కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ధాన్యాన్ని అమ్మిన రైతులకు కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్‌ల వద్ద రైతులు వినతి పత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రబీ పంట డబ్బులు తక్షణం చెల్లించకపోతే రైతులు ఖరీఫ్‌ సాగు చేయడం కష్టమని తెలిపారు. రైతులు క్రాఫ్ట్‌ హాలిడే ప్రకటిస్తే ఆహార సంక్షోభం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలన్నారు. సాగు చేసుకోవడానికి అందించాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహం సాగు సాయం కూడా రైతులకు ప్రభుత్వం అందించట్లేదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళారీ వ్యవస్థను రద్దుచేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు అందించారన్నారు. రైతుల సాగు చేసిన పంటలు కొనుగోలు జగన్‌ ప్రభుత్వమే చేసిందన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం రైతుల సమస్యను పరిష్కారం చేసి కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి చింతలపూడి అశోక్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement