‘యువత పోరు’ హోరు | - | Sakshi
Sakshi News home page

‘యువత పోరు’ హోరు

Jun 24 2025 3:35 AM | Updated on Jun 24 2025 4:25 AM

గుంటూరులో యువతను అడ్డుకుంటున్న పోలీసులు

మోసం బాబు సహజ లక్షణం

ఎగసిపడ్డ యువ కెరటాలు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన యువత అధికారులకు వినతిపత్రం అందజేత

ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా మాట్లాడుతూ చంద్రబాబుకు మోసం చేయడం పుట్టుకతో వచ్చిన సహజ లక్షణమని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలనిచ్చి యువత భవిష్యత్తును నట్టేట ముంచారని మండిపడ్డారు. ఏడాది కాలంలో ప్రతి ఒక్క యువతి, యువకుడికి చంద్రబాబు రూ. 36వేలు బకాయి పడ్డారని, అవి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి, కనీసం ఒక్క ఉద్యోగమైనా ఇవ్వలేదని మండిపడ్డారు. జాబ్‌ క్యాలండర్‌ అతీగతీ లేకుండా పోయిందని ఫాతిమా విమర్శించారు.

పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి మాట్లాడుతూ హామీలను నెరవేర్చలేని చంద్రబాబు ఏ మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నారన్నారు. ఫీజురీయింబర్స్‌ బకాయిలు, వసతిదీవెన, యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు.. అన్నీ ఎగ్గొట్టారని విమర్శించారు. డబ్బులు లేవంటూ అన్ని వర్గాల ప్రజలను నిలువునా వంచించారన్నారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో యువత కోసం పోరాటాలకు తాము సిద్ధమన్నారు. ఇవ్వాల్సిన హామీలు ఇవ్వకుండా, ఇదేమని ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారని, వీటిపై యువత తిరబడే రోజుల దగ్గర్లోనే ఉన్నాయని ఉత్తేజ్‌రెడ్డి హెచ్చరించారు.

యువత కోసం పోరాటాలకు సిద్ధం

ఉద్యోగాలు ఊడపీకిన బాబు

పార్టీ యువజన విభాగం రాష్ట్ర జోనల్‌ అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని తెలిపారు. అందులో పావు వంతైనా ఇచ్చిన పా పాన చంద్రబాబు పోలేదని మండిపడ్డారు. 20లక్షల ఉద్యోగాల సంగతి పక్కన బెడితే వలంటీర్లు మొదలుకుని నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఊడపీకారని దుయ్యబట్టారు. 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్న లోకేష్‌ 400 రోజులు అయినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement