
ఎస్హెచ్జీ గ్రూపులకు రూ.900 కోట్లు మంజూరు
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్): స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సాధికారత లక్ష్యంగా ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం క్రెడిట్ క్యాంపును అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఏపీలోని అమరావతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి జోన్లల్లోని ఎస్హెచ్జీ గ్రూపులకు రూ.900 కోట్లను మంజూరు చేశారు. ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ్ బజరంగ్సింగ్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఏపీ, టీజీ) ప్రణేష్కుమార్ అధ్యక్షత వహించారు. శివ్ బజరంగ్సింగ్ మాట్లాడుతూ సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడంలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషిస్తాయని ప్రశంసించారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్లు ఎన్.గౌరీశంకరరావు (అమరావతి), ఎం.రాజేష్ (విజయవాడ), అమరావతి జోన్ డెప్యూటీ జోనల్ మేనేజర్ కస్తూరి కృష్ణమోహన్, ఎం.శేషగిరిరావు పాల్గొన్నారు. వర్చువల్గా పలువురు జోనల్ మేనేజర్లు, డెప్యూటీ జోనల్ మేనేజర్లు హాజరయ్యారు.
స్వయం సహాయక సంఘాలకు చెక్కు
అందిస్తున్న బ్యాంక్ ఉన్నతాధికారులు