గీత కార్మికుల సమస్యలపై దృష్టిసారిస్తాం | - | Sakshi
Sakshi News home page

గీత కార్మికుల సమస్యలపై దృష్టిసారిస్తాం

Jun 23 2025 5:48 AM | Updated on Jun 23 2025 5:48 AM

గీత కార్మికుల సమస్యలపై దృష్టిసారిస్తాం

గీత కార్మికుల సమస్యలపై దృష్టిసారిస్తాం

ఏపీ గీత కార్పొరేషన్‌ చైర్మన్‌ గురుమూర్తి

నిజాంపట్నం: గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఏపీ గీత కార్పొరేషన్‌ చైర్మన్‌ వీరంకి గురుమూర్తి అన్నారు. మండలంలోని కళ్లిఫలం గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి గీత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుందన్నారు. గీత కార్మికుల ఉత్పత్తులను గుర్తింపు తీసుకువస్తామని పేర్కొన్నారు. తాటి కల్లు నుంచి తాటి బెల్లం తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాది సుభాషిణి, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్‌, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ పంతాని మురళీధరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement