పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

Jun 22 2025 3:46 AM | Updated on Jun 22 2025 3:46 AM

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

గుంటూరు మెడికల్‌: పెన్షనర్ల సమస్యల సాధనకు వారధిగా, సారథిగా ముందుండి కృషి చేస్తామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ తెలిపారు. గుంటూరు ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ హాలులో శనివారం స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఏపీ అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యా సాగర్‌, జనరల్‌ సెక్రటరీ డి.వి.రమణను పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నేతలు ఘనంగా సత్కరించారు. యోగా డే సందర్భంగా పలువురు ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్య సాధనకు ఏపీ ఎన్జీవో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పెన్షనర్లు తాత్కాలిక బెన్‌ఫిట్స్‌ కోసం ఆశించకుండా శాశ్వత ప్రయోజనాల కోసం కృషి చేయాలని తెలిపారు. ప్రస్తుతం పెన్షనర్స్‌ ఆడిట్‌ క్వాంటమ్‌ సాధించిన ఘనత ఏపీ ఎన్జీవో, స్టేట్‌ గవర్నమెంట్‌ అసోసియేషన్‌లకు మాత్రమే దక్కుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ప్రభుదాస్‌, ప్రెసిడెంట్‌ కరీమ్‌, సలహదారులు ప్రసాదరావు, పెద్దింటి అప్పారావు, గాలి నాయుడు పాల్గొన్నారు.

ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement