
బస్సులు లేక ప్రయాణికులకు ఇక్కట్లు
వైజాగ్కు తరలించడంతో అవస్థలు
పట్నంబజారు: అంతర్జాతీయ యోగ డే సందర్భంగా జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు వైజాగ్కు తరలి వెళ్లడంతో ప్రయాణికులు రెండు రోజులుగా ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్లో శనివారం నిర్వహించిన యోగాంధ్రా కార్యక్రమానికి గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బస్సులను తరలించారు. గుంటూరు డిపో –1 నుంచి 35, గుంటూరు డిపో –2 నుంచి 35, తెనాలి డిపో –25, మంగళగిరి–20, పొన్నూరు– 20, బాపట్ల– 18, రేపల్లె –22, చీరాల – 18, అద్దంకి నుంచి 22 బస్సులను యోగాంధ్రాకు తరలించారు. దీంతో పల్లె ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు బస్సులు కిక్కిరిసి కనిపించాయి. మూడు కార్గో బస్సులను మెకానిక్లతో కలిపి వైజాగ్కు పంపడంతో ఇక్కడ గ్యారేజీల్లో వారి కొరత ఏర్పడినట్లు తెలుస్తుంది. ఫిట్గా లేని బస్సులను గ్యారేజీ నుంచి బయటకు తీయకుండా అలాగే ఉంచారు. కొన్ని సర్వీసులు మాత్రమే నడిపారు. గతంలో సైతం రాజధాని ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు బస్సులను తీసుకెళ్లడంతో ఇబ్బందులు పడినట్లు ప్రయాణికులు వాపోయారు.