
జాబ్మేళాలో 60 మందికి ఉద్యోగాలు
పిడుగురాళ్ల: జాబ్ మేళాలో 60 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఈ.తమ్మాజీరావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆదేశాలతో జాబ్మేళా నిర్వహించారు. తమ్మాజీరావు మాట్లాడుతూ జాబ్మేళాకు 10 కంపెనీలు హాజరైనట్లు తెలిపారు. ఇంటర్వ్యూకు 214 మంది నిరుద్యోగులు హాజరయ్యారని, అందులో 60 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ బి.వి.కృష్ణారెడ్డి, జిల్లా ఉద్యోగ కల్పనా అధికారి ఎం.రవీంద్ర నాయక్, పిడుగురాళ్ళ స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ పి. శ్రీకాంత్, వీరాంజినేయులు, రమ్య, అంజిరెడ్డి, సురేష్, మస్తాన్, హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ
అధికారి ఈ.తమ్మాజీ రావు