
జననేతపై ఉప్పొంగిన అభిమానం
తాడేపల్లి రూరల్: రెంటపాళ్లకు బయలుదేరిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారిపొడవునా ఘన స్వాగతం లభించింది. తాడేపల్లి క్రిస్టియన్పేటలో మహిళలు బయటకు వచ్చి స్వాగతం పలకడంతో వైఎస్ జగన్ కారు దిగి అభివాదం చేశారు. 16వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి ప్రాతూరు కుంచనపల్లి అండర్పాస్ వద్ద వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు మేకా వెంకట రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్రాజు, తాడేపల్లి రూరల్ కన్వీనర్ అమరా నాగయ్య, మంగళగిరి రూరల్ పార్టీ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ, పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, వివిధ గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, పాల్గొన్నారు. వైఎస్ జగన్ కారు దిగి కరచాలనం చేశారు. అనంతరం మంగళగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్రెడ్డి కాన్వాయ్ వెంట ర్యాలీ నిర్వహించారు. టోల్గేటు వద్దకు చేరిన వైఎస్ జగన్ కాన్వాయ్కు స్థానిక నేతలు స్వాగతం పలికారు. తాడేపల్లి రూరల్ మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల కృష్ణమూర్తి, నియోజకవర్గ జేసీఎస్ మాజీ కన్వీనర్ మున్నంగి వివేకానందరెడ్డి, నాయకులు చిలకా మధు, కళ్ళం పిచ్చిరెడ్డి, ఉండ్రు కళ్యాణ్, మిరియాల రాంబాబు, గొడవర్తి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.