
పెదకాకానిలో జయహో... జగన్
పెదకాకాని: జై జగన్.. జైజై జగన్, జయహో.. జగన్ నినాదాలతో పెదకాకాని వై జంక్షన్ మార్మోగింది. అభిమాన నాయకుడిని చూసేందుకు బుధవారం పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కు పార్టీ జెండాలు, చిత్రపటాలతో ఘన స్వాగతం పలికారు. ఉదయం 10 గంటలకు పెదకాకాని వై జంక్షన్కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ను అంబటి మురళీకృష్ణ పూల బొకేతో స్వాగతించారు. అభిమాన నాయకుడిని కలిసేందుకు ఒక్కసారిగా వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు కాన్వాయ్ వైపు దూసుకుపోయారు. కారు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అభివాదం చేశారు. పెదకాకాని వై జంక్షన్, ఆటోనగర్ బైపాస్రోడ్డు అభిమానులతో కిక్కిరిసింది. వారి నినాదాలతో దద్దరిల్లింది. ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గోళ్ళ జ్యోతి, సర్పంచ్ పిట్టు శివకృష్ణారెడ్డి, జిల్లా యాక్టివిటివ్ కార్యదర్శి వుయ్యూరు సతీష్రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, ఆలపాటి రాఘవ, ముడియాల మల్లికార్జునరెడ్డి, కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, సఫారీ బాబు, పొందుగుల కమల్, దంతాల శ్రీనివాసరావు, బద్దెపూడి రమేష్, కూచిపూడి మధు తదితరులు పాల్గొన్నారు.