NEET Issue In Tamilnadu: నీట్​కు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్​పై పెట్రో బాంబు దాడి..రౌడీ షీటర్​ అరెస్ట్ .. అన్నామలై అనుమానాలు

NEET Oppose Man Hurls Petrol Bombs BJP Suspect Attack - Sakshi

చెన్నై(తమిళనాడు): టీ నగర్​లోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై​ పెట్రో బాంబు దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు దుండగులు పెట్రోల్​ బాటిళ్లతో ఆఫీస్​పై దాడికి తెగపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గురువారం ఉదయం ఈ ఘటనకు సంబంధించి వినోద్​ అనే వ్యక్తిని అరెస్ట్​ చేశారు. నీట్​ పరిణామాలతోనే తాను బీజేపీ ఆఫీస్​పై పెట్రోల్​ బాంబుతో దాడి చేశానని ఆ యువకుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. 

ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై. వినోద్​ ఒక రౌడీ షీటర్​ అని.. చదువుకు అతనికి పొంతన లేదని, అలాంటప్పుడు నీట్​ వ్యతిరేకంగా దాడి ఎందుకు చేస్తాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉండొచ్చని.. ఎన్​ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాడు. ఇక దాడి అనంతరం ఆఫీస్​ను పరిశీలించిన అన్నామలై.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశాడు.
 

ఇదిలా ఉండగా.. నీట్​పై తమిళనాడు ముందు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో వ్యతిరేక బిల్లు సైతం రూపొందించి ఆమోదించగా.. బీజేపీ అడ్డుచెప్తూ సభ నుంచి వాకౌట్​ చేసింది. కొన్ని నెలల తర్వాత పరిశీలించిన గవర్నర్.. బిల్లును​ ఆమోదించకుండానే అసెంబ్లీకి వెనక్కి తిప్పి పంపారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిణామాలు తట్టుకోలేకనే తాను దాడికి పాల్పడినట్లు వినోద్​ చెప్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత కొందరితో కలిసి పెట్రల్​ సీసాలను బీజేపీ ఆఫీసుల్లోకి విసిరాడు వినోద్​. ఇదిలా ఉంటే.. మాదకద్రవ్యాలకు బానిసైన వినోద్​పై రౌడీ షీట్​ కూడా ఉందని, సీసీ ఫుటేజీ ద్వారా మిగతా నిందితులను పట్టుకుంటామని టీనగర్​ డీసీపీ హరి చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top