జగిత్యాల: వరద కాల్వలోకి దూకి తల్లి కుమార్తెల ఆత్మహత్య

Mother And Daughter Commits Suicide By Jump Into Canal At Jagtial - Sakshi

సాక్షి, కరీంగనర్‌: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌లో విషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో .. ఏమో కానీ కుమార్తెతో కలిసి ఓ మహిళ వరద కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులు వనజ(28), శాన్వి(​6)గా గుర్తించారు. ఇంట్లో గొడవ జరగడంతో వనజ కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
(చదవండి: కనురెప్పకు ఏ కష్టమొచ్చిందో..!?)

అనంతరం వీర్దిదరు ఆత్మనగర్‌ వద్ద ఉన్న వరద కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం వీరి మృతదేహాలను గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. 

చదవండి: ‘నా చావుకి ఎవరూ బాధ్యులు కారు’

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top