పెళ్లిపీటలు ఎక్కకముందే వేధింపులు 

Man Molestation His Fiancee In Karnataka - Sakshi

సాక్షి, హుబ్లీ(కర్ణాటక): వివాహం నిశ్చయమైన యువతి ఇంకా పెళ్లి పీటలు ఎక్కనేలేదు. అప్పుడే కాబోయే భర్త అనుమానంగా చూడటం మొదలు పెట్టాడు. ఇలాంటి వ్యక్తితో జీవితం పంచుకోవడం ఇష్టం లేక ఆ యువతి బలవన్మరణం చెందింది. ఈ ఘటన  హుబ్లీ ప్రశాంత్‌నగర్‌లో చోటు చేసుకుంది. హుబ్లీకి చెందిన పవిత్ర పాటిల్‌కు హావేరి చెందిన అభినందన్‌తో వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌ 2న ముహూర్తం ఖరారు చేశారు. ఈక్రమంలో పవిత్రను అభినందన్‌ దాండేలికి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం తీసుకెళ్లాడు.

అప్పటినుంచి ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ వేధించసాగాడు. పవిత్ర  కుటుంబ సభ్యులకు తెలియజేసింది. పెళ్లి జరిగితే అన్నీ సర్దుకుంటాయని ఓదార్చారు.  తీవ్ర వేదనకు గురైన పవిత్ర శుక్రవారం తన ఇంటిలోనే  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అశోక్‌నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top