భర్త మృతి.. ఆ తర్వాత భార్య ఏం చేసిందంటే..? | Karnataka Woman Kills Son And Commits Suicide | Sakshi
Sakshi News home page

భర్త మృతి.. ఆ తర్వాత భార్య ఏం చేసిందంటే..?

Apr 17 2022 5:11 PM | Updated on Apr 17 2022 5:16 PM

Karnataka Woman Kills Son And Commits Suicide - Sakshi

సాక్షి, బెంగళూరు: భర్త మరణ వార్తను ఆమె తట్టుకోలేకపోయింది. కట్టుకున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. మరణ వార్త తెలిసిన కొన్ని గంటల్లోనే తన ఆరు నెలల కుమారుడిని చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్నాటకలోని రాయ్‌చూర్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. మంగళూరులోని అగ్నిమాపక దళంలో గంగాధర్ డ్రైవర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, గంగాధర్​ (36), శ్రుతి(30) భార్యాభర్తలు.. వీరికి ఆరు నెలల కుమారుడు అభిరామ్​ ఉన్నాడు. గంగాధర్‌ కుటుంబం రాయ్‌చూర్‌లో నివాసం ఉంటోంది. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి.. గంగాధర్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుంటికాన సమీపంలో నేషనల్‌ హైవే-66పై గంగాధర్​ దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

అయితే, రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడన్న వార్త శ్రుతికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిన భార్య.. భర్తలేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం అర్దరాత్రి సమయంలో తన ఆరు నెలల చిన్నారి అభిరామ్​ను హత్యచేసి, తాను సూసైడ్‌ చేసుకుంది. ఒక్క మరణంతో ఆ కుటుంబంలో ఊహించని పరిస్థితులు నెలకొనడంతో ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement