● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం పేరుతో పనిఒత్తిళ్లు ● సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా కొత్త యాప్‌లు ● పనిచేయని ఫోన్లు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కార్యకర్తలు ● సెల్‌ఫోన్ల స్థానంలో ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం పేరుతో పనిఒత్తిళ్లు ● సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా కొత్త యాప్‌లు ● పనిచేయని ఫోన్లు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కార్యకర్తలు ● సెల్‌ఫోన్ల స్థానంలో ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్‌

Apr 21 2025 12:26 AM | Updated on Apr 21 2025 12:26 AM

● పని

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం

జిల్లా

సమాచారం

కార్వేటినగరం : అంగన్‌వాడీ కేంద్రాల నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రేషన్‌ సరుకులను మరింత పకడ్బందీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం యాప్‌లో మార్పులు, చేర్పులు చేసింది. అప్పటి నుంచి అంగన్‌వాడీలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లు మొబైల్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ కాక అంగన్‌వాడీలు అవస్థలు పడుతున్నారు. యాప్‌ల నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సరుకులు పంపిణీ చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తాజాగా బాలసంజీవని 2.0 వెర్షన్‌తో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ యాప్‌లో వర్కర్లు, హెల్పర్లు ఫొటో క్యాప్సర్‌ చేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో అంగన్‌వాడీలు పోషకాహార పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన యాప్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పనిని మూడు యాప్‌ల్లో వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉండటం, యాప్‌లో సాంకేతిక లోపం కారణంగా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు.

హాజరు ఇలా.. భోజనం ఎలా?

ప్రతి రోజు విధిగా ఉదయం 9 గంటలకు, తిరిగి సాయంత్రం 4 గంటలకు ఫేస్‌ యాప్‌ వేయాలి. అలాగే వచ్చిన వెంటనే పిల్లల హాజరు ఫొటో తీయాలి. ఎంత మంది హాజరైతే అంత మంది చిన్నారులకు మాత్రమే ఆహారం అందించాల్సి ఉంది. మూడేళ్లల్లోపు చిన్నారులు కావడంతో జిల్లాలోని చాలా అంగన్‌ఽవాడీ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల వరకు పిల్లలు వస్తూనే ఉంటారు. ముందుగానే యాప్‌ నమోదు చేసిన కారణంగా తర్వాత వచ్చిన పిల్లలకు ఆహారం అందించేందుకు అవకాశం లేకపోవడంతో వండిన ఆహారాన్నే అందరికి సరిపెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యను అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని అంగన్‌వాడీలు వాపోతున్నారు.

పనిచేయని ఫోన్లతో ఇబ్బందులు

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బాలసంజీవని యాప్‌ సక్రమంగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో యాప్‌ ఇన్‌స్టాల్‌ అయినా సర్వర్లు మొరాయిస్తుండటంతో వివరాలు నమోదు చేసేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం అంతంత మాత్రంగానే ఉంది. నెట్‌ లేకపోతే యాప్‌ ఓపెన్‌ కావడం లేదు. – విజయ,

సీఐటీయూ ఆధ్యక్షురాలు,

కార్వేటినగరం ప్రాజెక్టు, శ్రీరంగరాజపురం

ట్యాబ్‌లు పంపిణీ చేయాలి

బాలసంజీవని 2.0 యాప్‌తో అంగన్‌వాడీలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇచ్చిన మొబైల్‌ ఫోన్లలో ఈ యాప్‌ పనిచేయడం లేదు. పాత ఫోన్లను వెనక్కు తీసుకుని ఆ స్థానంలో 5జీ ట్యాబ్‌లు పంపిణీ చేసి అంగన్‌వాడీలకు యాప్‌ కష్టాలు తొలగించాలి. యాప్‌ల నిర్వహణతో అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీలు పడుతున్న అవస్థలు తొలగించాలి.

– మమత, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి,

కార్వేటినగరం ప్రాజెక్టు, కార్వేటినగరం

పనిభారం తగ్గించాలి

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలపై పనిభారం అఽధికమైంది. కేంద్రాల్లో యాప్‌ల నిర్వహణతో సతమతమవుతున్నారు. ఈ పనులే కాకుండా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. అరకొర వేతనం ఇస్తూ అంగన్‌వాడీలతో వెట్టి చాకిరి చేయించడం సరికాదు.అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వారిపై పనిభారం తగ్గించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడుతాం. – వాడ గంగరాజు,

సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు, చిత్తూరు

సెల్‌ఫోన్లు వెనక్కి తీసుకుని

5జీ ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న అంగన్‌వాడీలు

అంగన్‌వాడీ

కేంద్రాలు 2420

సీడీపీఓలు 12 మంది

మొత్తం

కార్యకర్తలు 2420

పర్యవేక్షకులు 70 మంది

గత ప్రభుత్వంలో పకడ్బందీగా సేవలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో పకడ్బందీగా సేవలు అందాయి. ఆరు యాప్‌లు అమలు చేసి పారదర్శకతకు పెద్దపీట వేసింది. పోషణ ట్రాకర్‌ యాప్‌, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌, హాట్‌కుక్‌ యాప్‌ తదితర యాప్‌లతో ప్రభుత్వం నిత్యం పర్యవేక్షించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల, గర్భిణులు, బాలింతలకు తాగునీరు, మరుగుదొడ్లకు సంబంధించి వినియోగించుకునేందుకు నీరు అందుబాటులో ఉంచింది, లేనిది యాప్‌ వివరాలు నమోదు చేస్తే ఆర్‌డబ్ల్యూస్‌ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నీటి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకునేలా కృషి చేసింది. గుడ్ల సరఫరాకు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తెచ్చి అమలు చేసింది.

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం1
1/5

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం2
2/5

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం3
3/5

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం4
4/5

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం5
5/5

● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement