విజింజం పోర్టులో ఎంఎస్‌సీకి 49 శాతం వాటా | Switzerland MSC to acquire 49 Per stake in Adani Vizhinjam port in Kerala for Rs 13220 crore | Sakshi
Sakshi News home page

విజింజం పోర్టులో ఎంఎస్‌సీకి 49 శాతం వాటా

Jul 1 2026 4:44 AM | Updated on Jul 1 2026 4:44 AM

Switzerland MSC to acquire 49 Per stake in Adani Vizhinjam port in Kerala for Rs 13220 crore

భారత్‌ పోర్టు రంగంలో అతిపెద్ద విదేశీ ప్రైవేటు పెట్టుబడి

డీల్‌ విలువ రూ. 11,800 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌)కు చెందిన కేరళలోని విజింజం పోర్టులో 49% వాటాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఎమ్‌ఎస్‌సీ గ్రూప్‌ కొనుగోలు చేయనుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్, లాజిస్టిక్స్‌ సంస్థ అయిన ఎమ్‌ఎస్‌సీ తన అనుబంధ సంస్థ టెర్మీనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ (టీఐఎల్‌) ద్వారా  1.4 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.11,800 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. భారత పోర్టు రంగంలో ఇదే అతిపెద్ద విదేశీ ప్రైవేటు పెట్టుబడిగా అదానీ పోర్ట్స్‌ పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement