
Stock Market Updates ముంబై: ఇవాళ ముంబై స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 52,694 పాయింట్లతో మొదలైంది. నిన్న సాయంత్రం 52,372 పాయింట్ల వద్ద మార్కెట్ క్లోజ్ అయ్యింది. కాగా, ఈ రోజు 322 పాయింట్లు లాభపడింది. ఉదయం 9:30 గంటలకు 52,608 పాయింట్ల వద్ద నమోదు అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ నిన్న 15,692 పాయింట్ల వద్ద క్లోజ్ అవగా ఈ రోజు మార్కెట్ ప్రారంభం కాగానే 101 పాయింట్లు లాభ పడింది. ఉదయం 9:30 గంటలకు 15,794 పాయింట్ల వద్ద కదలాడుతోంది.
ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, మారుతి సుజూకి ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాలు పొందాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ ఐటీ కంపెనీలు నష్టపోయాయి.