దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 702.06 పాయింట్లు లేదా 0.91శాతం లాభంతో 77,443.88 వద్ద, నిఫ్టీ 196.30 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,159.10 వద్ద నిలిచాయి.
కొథారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్, లక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ముతూత్ మైక్రోఫిన్ లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డీ-లింక్ (ఇండియా) లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నీలమలై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, బోధి ట్రీ మల్టీమీడియా లిమిటెడ్, లోధా డెవలపర్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


