యస్‌ బ్యాంక్‌లో వాటాలకు కార్లైల్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

Rbi Approves Yes Bank Stake Sale To Carlyle, Advent - Sakshi

ముంబై: యస్‌ బ్యాంక్‌లో 9.99 శాతం వరకూ వాటాలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజాలు ది కార్లైల్‌ గ్రూప్, యాడ్వెంట్‌లకు రిజర్వ్‌ బ్యాంక్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. యస్‌ బ్యాంక్‌లో రూ. 8,000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఈ ఏడాది జూలైలో ఈ రెండు సంస్థలు ప్రతిపాదించాయి.

నిబంధనల ప్రకారం బ్యాంక్‌లో 5 శాతానికి మించి వాటాలు తీసుకోవాలంటే ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి. కార్లైల్, యాడ్వెంట్‌ ప్రతిపాదనలపై రిజర్వ్‌ బ్యాంక్‌ రెండు వేర్వేరు లేఖల ద్వారా నవంబర్‌ 30న ‘షరతులతో కూడిన ఆమోదం‘ తెలిపినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.

చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్‌ కంపెనీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top